Search

Tuesday 19 February 2013

'జంజీర్'లో బికినీతో నటించలేనని చెప్పా... కానీ... మహీగిల్

Mahie gill'జంజీర్' చిత్రంలో వ్యాంప్ క్యారెక్టర్ చేస్తున్న సెక్సీ గాళ్ మహీగిల్ తను 'జంజీర్'లో బికినీ ధరించి నటించడం కుదరదని అందట. అలా ఎందుకు అనాల్సి వచ్చిందో మహీ వివరించింది. 1973 నాటి అమితాబ్ జంజీర్ చిత్రంలో తను ఇప్పుడు నటిస్తున్న పాత్రను బిందు అద్భుతంగా చేసిందట. గ్లామరస్ పాత్రలో ఆమె అదరగొట్టిందట.

బిందు అంతటి గ్లామర్ తను పండించలేననీ, అంతటి సత్తా తనకు లేదని డైరెక్టర్‌తో చెప్పానంటోంది. ఐతే దర్శకుడికి తనపై పూర్తి నమ్మకం ఉందని ఆ పాత్రను తనకు కట్టబెట్టారని అంటోంది. గ్లామరస్‌గా నటించడం తనకు ఇదే మొట్టమొదటిసారని కబుర్లు చెపుతోంది. మరి అంతకుముందు ఎక్స్‌పోజింగ్ చేస్తూ నటించినవి గ్లామర్ పాత్రలు కావా...? అంటే బికినీ వేస్తేనే గ్లామర్ కామోసు.

ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి పాత్రలో విద్యాబాలన్... ఐశ్వర్యారాయ్ ఛాన్స్ మిస్

Vidya balanతన గాత్రంతో మంత్రముగ్ధుల్ని చేసే ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి జీవితాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పాత్రలో 'డర్టీ పిక్చర్‌'లో సిల్క్ స్మిత పాత్రను పోషించిన విద్యా బాలన్ నటించబోతోంది. ఐతే తొలుత ఈ పాత్రకు ఐశ్వర్యారాయ్‌ను అనుకున్నారట. కానీ ఐశ్వర్యారాయ్ నటించేందుకు తటపటాయించడంతో విద్యాబాలన్‌ను సంప్రదించినట్లు సమాచారం.

సుమారు 70 కోట్ల రూపాయల వ్యయంతో హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. అంతేకాదు ప్రముఖ గాయని లతా మంగేష్కర్ జీవిత కథపై సినిమా తీస్తే అందులో కూడా తాను నటిస్తానని విద్యా బాలన్ అంటోందట. మొత్తానికి సంగీత కోవిదులు ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా విద్యాబాలన్ ఎలా నటిస్తుందో చూడాల్సిందే.

వెంకీ ‘షాడో’ రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా?

Venkatesh Shadow Release Postpone To April విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న ‘షాడో' చిత్రం రిలీజ్ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకరాం ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈచిత్రాన్ని మార్చి 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 28కి వాయిదా వేసారు. ఏమైదో ఏమో కానీ ఇప్పుడు ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వెంకీతో పాటు ఈ చిత్రంలో శ్రీకాంత్ మరో మఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు.
షాడో' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచంలోని ఆరు వేర్వేరు ప్రదేశాల్లో ఈచిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మాఫియా సినిమా అయినంత మాత్రాన సినిమా మొత్తం సీరియస్ సాగదని, కమెడీ టచ్, ఫన్నీ సీన్స్ మెండుగా యాడ్ స్తున్నారని... ఇందుకోసం కోనవెంకట్, గోపీమోహన్‌లు ఆసక్తికరమైన స్ర్కిప్టు రూపొందించారని తెలుస్తోంది.
నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్‌, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్‌, రావురమేష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్‌, గోపిమోహన్‌. మాటలు: కోనవెంకట్‌, మెహర్‌ రమేష్‌. సంగీతం: తమన్‌. కెమెరా: ప్రసాద్‌, మూరెళ్ల, ఎడిటింగ్‌, మార్తాండ్‌, కె.వెంకటేష్‌. ఆర్ట్‌: ప్రకాష్‌ ఏ ఎస్‌. ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి. అజరుకుమార్‌ వర్మ. మరో వైపు వెంకీ ఈ చిత్రంతో పాటు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

బి.గోపాల్‌ దర్శకత్వంలో యంగ్ యాక్షన్ హీరో

Gopichand Work With Director B Gopal సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు,ఇంద్ర వంటి మెగా హిట్ చిత్రాలు రూపొందించిన బి.గోపాల్ చిత్రాలు అంటే ప్రేక్షకులలో ఆసక్తే. ఆయన రామ్ తో చేసిన మస్కా తర్వాత ఏ చిత్రమూ చేయలేదు. తాజాగా మరో చిత్రం కమిటయినట్లు సమాచారం. టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ తో సినిమా చేయటానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
ప్రస్తుతం గోపీచంద్‌ ప్రస్తుతం 'జాక్‌పాట్‌' చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరవాత నటించే చిత్రానికి బి.గోపాల్‌ దర్శకత్వం వహిస్తారని సమాచారం. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మిస్తారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు సాగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
నిజానికి 2010లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభం కావాల్సి ఉంది. అప్పుడే మస్కా రైటర్ చెప్పిన కథని బి.గోపాల్ ఓకే చేసి గోపీచంద్ తో సినిమా అనుకునన్నారు. అప్పట్లో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఈ కాంబినేషన్ తెరకెక్కుతుందని తెలుస్తోంది.
తెలుగులో అగ్రహీరోలందరితో పనిచేసిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండటంతో ప్రాజెక్టుపై క్రేజ్ ఏర్పడుతోంది. గోపీచంద్, గోపాల్ తొలి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకునే విధంగా ఉండనుంది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా ఉండే కథను ఎన్నుకుని గోపాల్ ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారు.
మరో ప్రక్క గోపీచంద్‌, తాప్సీ జంటగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మొత్తానికి పూర్తైంది. రీసెంట్ గానే ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో చేసారు. దాంతో టాకీ ఆల్ మోస్ట్ ఫినిష్ అయినట్లు చెప్తున్నారు.

అంబానీల పార్టీకి...చిరు, పవన్, నాగ్, చరణ్, వెంకీ, సమంత!

Anil Ambani Invitation T Town Stars దేశంలోని టాప్ ధనవంతుల్లో ఒకరైన అనిల్ అంబానీ ‘రిలయన్స్ బిగ్ ఎంటర్ టైన్మెంట్స్'అనే సంస్థ స్థాపించి సినిమా రంగంలో కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రిలయన్స్ సంస్థ టాలీవుడ్లో దాదాపు 80 కోట్ల వరకు పెట్టుబడి వ్యాపారం చేసింది. ఈ క్రమంలో తెలుగు సినీ ప్రముఖులతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకుంటోంది అనిల్ అంబానీ ఫ్యామిలీ.
తాజాగా అనిల్ అంబానీ ముంబైలోని పాలిహిల్ ఏరియాలో దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చు చేసి 150 మీటర్ల పొడవైన భారీ నివాస భవంతిని నిర్మించుకున్నాడు. సకల సౌకర్యాలతో కూడిన ఈ విలాసవంతమైన భవనంలో లేని సౌకర్యం అంటూ లేదు. తన అన్నయ్య ముఖేష్ అంబానీ ఇంటికీ ధీటుగా అనిల్ దీన్ని నిర్మించుకున్నాడు.
మార్చి 12న ఈ ఇంట్లోకి గృహ ప్రవేశం చేయబోతున్న అనిల్ అంబానీ బాలీవుడ్ తో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఆహ్వానం పంపారు. అందరికీ ఈ ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, హీరోయిన్లు అనుష్క, సమంత, కాజల్, ఇలియానా, దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్ తదితరులకు ఆహ్వానాలు అందాయి.
రియలన్స్ ఎంట్ టైన్మెంట్ ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమాను బివిఎస్‌ఎన్ ప్రసాద్‌తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్లో నటిస్తున్న ‘జంజీర్' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

అలీ చంపేస్తున్నాడు! పెద్దగా ఉందంటూ ‘సమంత’ వింత ట్వీట్

Ali Samantha At Pollachi Shooting హాట్ హీరోయిన్ సమంత ఈ మధ్య తన ట్విట్టర్లో వింత వింత పోస్టులు చేస్తోంది. తాజాగా ఓ ఫోటోను పోస్టు చేసి దానికి దానికింద వింతైన కామెంట్ చేసింది. ‘అలీ విశాలమైన చేయి ద్వారా మరణం. అతను చాలా పెద్ద చేయి కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు నేను ఇంత పెద్ద చేయిని చూడలేదు' అంటూ సమంత ట్వీట్ చేసింది.
ప్రస్తుతం ఆమె, పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో భాగంగా పొల్లాచ్చిలో ఉంది. షూటింగ్ స్పాట్లో ఆలీతో సరదాగా తీసుకున్న ఫోటోను తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత మెయిన్ హీరోయిన్‌గా చేస్తోంది.
మరో హీరోయిన్ ప్రణీత ఈచిత్రంలో సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఈచిత్రానికి ‘తుఫాన్', ‘సరదా' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. అయితే ఇంకా ఏ టైటిల్ కూడా అధికారికంగా ఖరారు చేయలేదు.

పూర్తిగా కమర్షియల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈచిత్రం పవన్ కళ్యాన్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో వినోదాత్మకంగా రూపొందుతోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచ్ డైలాగులు, స్క్రీన్ ప్లే సినిమాకు హైలెట్ కానుంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Photos:సెక్సీ తమన్నా గాంగ్నమ్ స్టైల్ డాన్స్

తన సెక్సీ అందాలు, ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్‌తో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ తమన్నా...ప్రస్తుతం బాలీవుడ్‌లో అజయ్ దేవగన్‌తో ‘హిమ్మత్ వాలా' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో తమన్నా ‘గాంగ్నమ్ స్టైల్' డాన్స్ చేయబోతోందట. ఈ చిత్రంలోని ‘బుం పె హాత్' అనే పాటలో తమన్నా ‘గాంగ్నమ్ స్టైల్' స్టెప్పులు వేయనుందని సమాచారం.
ఈచిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా వాసు భగ్నాని, యూటీవీ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది. వాస్తవానికి హిమ్మత్ వాలా సినిమాకు మూలం టాలీవుడ్లోనే ఉంది. తెలుగులో కృష్ణ,జయప్రద జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊరికి మొనగాడు' చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది.
అదే సినిమాను పద్మాలయా సంస్థ హిందీలో 'హిమ్మత్ వాలా' పేరుతో 1983లో తెరకెక్కించింది. ఇందులో జితేంద్ర, శ్రీదేవి నాయకానాయికలుగా నటించారు. ఈ సినిమాకు కూడా కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే బాలీవుడ్ లో శ్రీదేవి అందాల తారగా మార్కులు సంపాదించారు. ఇప్పుడు అదే చిత్రం రీమేక్‌లో తమన్నా నటిస్తోంది. ‘చాంద్ సా రోషన్ చెహ్రా' అనే బాలీవుడ్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన తమన్నాకు అక్కడ కలిసి రాక సౌత్ బాట పట్టి సక్సెస్ అయింది. మరి హిమ్మత్ వాలా రీమేక్ ద్వారా తమన్నా బాలీవుడ్లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

ఎన్టీఆర్ ‘బాద్ షా’ ఆడియో వినూత్నంగా..?

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న ‘బాద్ షా' చిత్రం ఆడియోను వినూత్న రీతిలో విడుదల చేసేదుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ఇంటిపై ఇటీవల ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడియో వేడుక సాదాసీదాగా నిర్వహిస్తే ఆ ఎఫెక్టు వల్లనే ఇలా చేసారనే విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో, బాద్ షా ఆడియో వేడుక వినూత్న పద్దతిలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలో ఆడియో వేడుకకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. మార్చి 10వ తేదీన ఆడియో వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ‘బాద్ షా' చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం జూ ఎన్టీఆర్‌పై స్పెయిన్లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. ‘బాద్ షా' చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్ గా చేస్తోంది.
baadshah might have an innovative audio launch
దర్శకుడు శ్రీను వైట్ల ‘బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ ‘బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

తన బ్రా సైజుపై....సోనమ్ సంచలన కామెంట్

Sonaam Kappor Revealing Her Bra Size సోనమ్ కపూర్ ఇలా పచ్చిగా మాట్లాడటంపై పలువురు విమర్శిస్తున్నారు. సోనమ్ కపూర్ పబ్లిసిటీ కోసమే ఇలా చేసిందని, పబ్లిసిటీ కోసం ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయడం ఏమిటని మండి పడుతున్నారు. పైగా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ కార్యక్రమం సందర్భంగా ఆమె ఈ కామెంట్స్ చేయడంతో....ఇప్పటి వరకు కెరీర్లో ఒక్క హిట్ సినిమా కూడా లేని సోనమ్ తన పాపులారిటీ పెంచుకోవడానికి ఇలా అడ్డదారిలో ప్రయాణిస్తోందని మరికొందరంటున్నారు.

ఫోర్న్ ప్రొడ్యూసర్‌తో కత్రినా, నగ్నంగా బిపాసా(షాకింగ్ పిక్చర్స్)

బాలీవుడ్ సినిమాల్లో హాట్ అండ్ సెక్సీ సీన్లు, కాంట్రవర్సీ సీన్లు ఎప్పడో ప్రారంభం అయ్యాయి. ఆ నాటి కాలంలో రేఖ లాంటి హీరోయిన్లు తమ హాట్ అండ్ సెక్సీ అప్పియరెన్స్ తో ప్రేక్షకుల మతి పోగొడితే....ఈ కాలం హీరోయిన్లు నగ్నంగా నటించడానికి కూడా సై అంటూ ముద్దు సీన్లతో వెండి తెరపై రెచ్చి పోతున్నారు.
ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో శృంగార ప్రధాన మైన సినిమాల జోరు పెరిగి పోయింది. సినిమా నేపథ్యం ఏదైనా...అందులో హాట్ అండ్ సెక్సీ పడక గది సీన్లు, రొమాంటిక్ సీన్లు జొప్పించి ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఉత్సవ్ సినిమాలో రేఖ బోల్డ్ గా నటించడం అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. ఈ మధ్య కాలంలో పడక గది, కిస్సింగ్ హాట్ సీన్లతో ఇమ్రాన్ హాస్మి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. వన్స్ అపానె టైం ముంబై చిత్రంలో ఇమ్రాన్ హస్మి-ప్రాచీ దేశాయ్ పడక గది సన్నివేశాలు వేడిపుట్టించాయి. అదే విధంగా మర్డర్ 2 చిత్రంలో ఇమ్రాన్-జాక్వెలిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.
అదే విధంగా మరో సినిమాలో రణదీప్ హుడా-మహిగిల్ హాట్ కిస్ సీన్ ద్వారా వార్తల్లోకెక్కారు. కునాల్ ఖేము తన రాబోయే సినిమా ‘బ్లడ్ మనీ'లో తన కో స్టార్ మియాతో హాట్ సీన్లలో రెచ్చిపోయాడు. అందుకు సంబంధించిన సీన్లు ఆన్ లైన్లో లీక్ అయ్యాయి. ఇక బిండీ బజార్ చిత్రంలో వేదితా-ప్రశాంత్ రొమాంటిక్ హాట్ సీన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ సీన్ సంచలనం సృష్టించింది.
అదే విధంగా జిస్మ్-2 చిత్రంలో రణదీప్ హుడా, సన్నీ లియోన్ మధ్య సెక్స్ సీన్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇలా బాలీవుడ్ సినిమాల్లో బాగా పాపులర్ అయిన శృంగార సన్నివేశాలు, కాంట్రవర్సీ సీన్లపై ఓ లుక్కేద్దాం.....

వర్మ ‘26/11 ఇండియాపైదాడి’ బడ్జెట్ అంతా?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 26/11 ముంబై దాడుల సంఘటనపై సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ‘ద అటాక్స్ ఆఫ్ 26/11' పేరుతో రూపొందుతున్న ఈచిత్రాన్ని తెలుగులో ‘26/11 ఇండియాపై దాడి' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ముంబై దాడుల సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపెట్టనున్నారు.
తాజాగా ఈచిత్రానికి సంబంధించిన బడ్జెట్ వివరాలు బయటకు లీకయ్యాయి. బడ్జెట్ దర్శకుడిగా, తక్కువ బడ్జెట్ లోనే సినిమాలు తీసే డైరెక్టర్ గా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకు మాత్రం భారీగానే ఖర్చు పెట్టించాడట. బాలీవుడ్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి వర్మ రూ. 25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
the attacks 26 11 budget
కేవలం తాజ్ హోటల్ సెట్ వేయడానికే రూ. 4 కోట్ల వరకు ఖర్చయిందట. అదే విధంగా ముంబై సిఎస్‌టి స్టేషన్లో పర్మీసన్ కోసం కూడా భారీగానే ఖర్చయింది. సిఎస్‌టి స్టేషన్లో దాదాపు 200 మంది జూనియర్ ఆర్టిస్టులతో సీన్లు చిత్రీకరించారట. సినిమా మొత్తం రియల్ సంఘటనలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండనుంది.
మానవ చరిత్రలో న్యూయార్క్ లో జరిగిన 9/11 తీవ్రవాదుల దాడుల కంటే భయంకరమైనవి ఎప్పుడూ జరగలేదు. కానీ జరిగిన తీరులో 26/11 ముంబయ్ దాడులు వాటికంటే భయంకరమైనవి. నా చిత్రంలో ముంబయ్ దాడుల వెనుక అసలు కథ, వాటిలో పాలుపంచుకున్న వ్యక్తుల భావోద్వేగాలను తెరకెక్కించాను అంటున్నారు దర్శకుడు వర్మ. అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రంలో సంజీవ్ జైస్వాల్ అనే నటుడు తీవ్రవాది కసబ్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు నానా పాటేకర్ ముంబై నటర పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. మార్చి 1, 2013న ఈ చిత్రం విడదల కానుంది.

నగ్నత్వంలో తప్పులేదంటూ హాట్ బ్యూటీ స్టేట్‌మెంట్

Rooney Mara About Human Body నగ్నంగా నటించడంలో తప్పులేదంటూ బోల్డ్ గా స్టేట్ మెంట్ ఇచ్చేసింది హాలీవుడ్ హాట్ బ్యూటీ రూనీ మారా. అంతే కాదు నగ్నం వెండి తెరపై మనల్ని చూడటం వల్ల ప్రజలు ఏమీ షాక్‌కు గురికారని, నగ్నంగా నటించడం కూడా ఓ కళే అని చెబుతోంది ఈ సెక్సీ లేడీ.
‘ది గర్ల్ విత్ డ్రాగన్ టాటూ' చిత్రంలో నటించి ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన రూనీ మారా ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ప్రపంచలోని అందరికీ ఒకే రకమైన శరీర భాగాలు ఉంటాయి. అందు వల్ల వేరొకరి శరీరాన్ని నగ్నంగా చూడటం వల్ల షాక్ అవుతారనే వాదన సరైంది కాదు. మనకుండే లాంటి శరీర భాగాలే ఇతరులకూ ఉంటాయి. నగ్నంగా కనిపించడం తప్పుగా, సిగ్గుగా భావించడం సరికాదు' అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది.
సినిమాల్లో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే న్యూడ్ సీన్ చేయడం సినీ కళాకారులుగా మన బాధ్యత, నాకు ప్రతి సినిమాలో ఇలాంటి అవకాశం వచ్చి ఎలాంటి భయం లేకుండా చేస్తాను అంటోంది. అంతే కాదు రియల్ సెక్స్ సీన్స్ చేయడానికి కూడా నేను రెడీ అంటూ ప్రకటించేసింది రూనీ మారా.

ఢిల్లీ గ్యాంగ్ రేప్‌పై ఆర్. నారాయణమూర్తి చిత్రం

R Narayana Murthy Make Movie On Delhi Rape ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటన ఆధారంగా ఆర్‌.నారాయణమూర్తి ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించే ఈ చిత్రానికి 'కలకత్తా కాళీ' అనే పేరుని ఖరారు చేశారు. ఈ నెల 23 నుంచి గోదావరిఖనిలో చిత్రీకరణ మొదలుపెడుతున్నుట్లు ఆయన సోమవారం కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లిలో వెల్లడించారు.
నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టు అగ్రనేత దివంగత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీ ఉద్యమ పోరాటాన్నీ తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. కిషన్‌జీ జీవితం, చేపట్టిన ఉద్యమాన్ని అందులో చూపిస్తామనీ, తెలుగు, హిందీ భాషల్లో ఆ చిత్రం ఉంటుందనీ ఆయన చెప్పారు.
ఇక ఈ మధ్యనే...ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'పీపుల్స్‌ వార్‌'. బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్లకు వ్యతిరేకంగా తీసిన సినిమా ఇది. సోంపేట, కాకరాపల్లి తదితర గ్రామాల ప్రజలు థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని ఎంచుకొని రాసుకొన్న కథే ఇది. హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉద్యమకారులే ఇందులో హీరోలు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలే ఈ చిత్రంలో విలన్లు . శ్రీహరి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషించారు.

ప్రభాస్‌ని ఎత్తుకున్న క్షణం... : అనుష్క

Anushka Happy With Mirchi Result రీసెంట్ గా విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న మిర్చి చిత్రంలో అనుష్క ..వెన్నెల పాత్రలో గ్రామీణ యువతిగా చేసింది. ఆ చిత్రంలో ఆమె ఓ సీన్ లో ప్రభాస్ ని ఎత్తుకుంది. అదే ట్రైలర్స్ లో సైతం వేస్తున్నారు. దానికి మంచి అప్లాజ్ వస్తోంది. ఆ సీన్ గురించి అనూష్క మాట్లాడుతూ....ఓ సన్నివేశంలో ప్రభాస్‌ని ఎత్తుకున్నా.. వాడిని ఎలా ఎత్తుకున్నావని వాళ్ల అమ్మ అడిగితే.. ఎం చెప్పాలో తెలియ లేదు. ఆ క్షణం మరువలేనిది అంటూ చెప్పుకొచ్చింది.
ఇక మిర్చి లో వెన్నెల పాత్రలో ఆకట్టుకున్నారని అందరూ అంటుంటే ఒళ్లుపులకరిస్తుంది. ఈ పాత్ర నాకు చాలా లక్కీగా దొరికింది. చాలాకాలం తర్వాత వినోదాన్ని పండించే పాత్ర అందులోనూ పరికిణి గురించి అందరి దగ్గ రినుంచి చాలా ప్రశంసంలు వస్తున్నందున ఆనందంగా వుంది. శివగారు బేసిక్‌గా రచయిత కావడం వల్ల అనుభవమున్న దర్శకుడిలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో పూర్తిగా కథనుంచే సంభాషణలన్నీ చక్కగా రాశారు. ప్రేమానురాగాలకు ఈ చిత్రం నిలువెత్తు నిదర్శనం అంటూ వివరించింది.
భవిష్యత్ ప్రాజెక్టుల గురించి చెప్తూ...కహానీ రీమేక్‌ చిత్రంలో నటించమని శేఖర్ కమ్ముల నన్ను అడిగారు. కాల్షిసట్‌ స ర్దుబాటు కాక చేయలేదు. అయినా అన్ని సినిమాలకు నేనే చేయాలని లేదు కదా. ప్రస్త్తుతం రుద్రమదేవి, బహుబలి సినిమాలు ఒప్పుకున్నాను. వాటిపైనే దృష్టి పెట్టాలి. ఒక సినిమా అంగీకరించే ముందు కథకే ప్రాధాన్యతనిస్తాను. కథ ప్రకారమే పాత్రలు ఉంటాయి. ఇక కాంబినేషన్‌ సినిమాలంటే తొలుత స్కిప్ట్‌ బావుండాలి అప్పుడే అవి విజయం సాధించే అవకాశం ఉంటుంది అని అనుష్క పేర్కొంది.

అనుష్క అచ్చ తెలుగు అమ్మాయిలా పట్టు పరికిణితో కనిపించిన చిత్రం ఇటీవలే విడుదలైన మిర్చి. ఈ చిత్రాన్ని ప్రభాస్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌లు నిర్మించారు. తన పాత్రకు మంచి స్పందన లభిస్తోంది అనుష్క తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. సినిమా విజయానికి నిర్మాణ విలువలు, దర్శకుడి ప్రతిభ మీదే ఆధారపడి వుంటుంది అని అంది.

నైజాంలో ‘మిర్చి’ ఘాటు, అమెరికాకు ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘మిర్చి' చిత్రం అమెరికాలో కలెక్షన్ల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రభాస్ అభిమానులకు శుభవార్త అందుతోంది. ఈ నెల 22, 23న ప్రభాష్‌తో కలిసి సినిమా చూసే అవకాశం మీరు దక్కించుకోవచ్చు.
సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ అమెరికా వెలుతున్నాడు. ఈ నెల 22న లాస్ ఏంజిల్స్ లో, ఈ నెల 23న బే ఏరియాలో అభిమానులను కలవనున్నాడు. ప్రభాస్ ను కలిసి అతనితో పాటు సినిమా చూసేందుకు 916-496-1921, 908-787-2933 నెంబర్లు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవడం పాటు, టిక్కెట్లు దక్కించుకోండి.
prabhas is going usa
కాగా...నైజాం ఏరియాలో ‘మిర్చి' సినిమా కలెక్షన్లు అదిరిపోతున్నాయి. తొలి 11 రోజుల్లో మిర్చి చిత్రం నైజా ఏరియాలో 11.10 కోట్లు షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ టాక్. సినిమా బిజినెస్ పూర్తయ్యేలోగా ఈ చిత్రం నైజాం ఏరియాలో దాదాపు 16 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అంచనా.
కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా చేయగా, యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా ‘మిర్చి' చిత్రాన్ని నిర్మించారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, ‘సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.

Popular Posts